తెలుగు సినిమా ఇండస్ట్రీని మూడు నెలలు మురిపించిన కరోనా.. ఆ తర్వాత ఊహించని వేగంతో దెబ్బ తీసింది. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఎంటర్ టైన్ మెంట్ పూర్తిగా స్థంభించిపోయింది. ఆ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. షూటింగ్స్ ప్రారంభించారు.. చిన్నా, పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేశాయి.
ఈ నేపథ్యంలోనే రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కు వెళ్లిపోయాయి. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన.. లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం వంటి సినిమాలు రిలీజ్ కాలేదు. పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి.
మాస్ మహరాజ్ రవితేజ అప్ కమింగ్ మూవీ ‘ఖిలాడీ’ని కూడా వాయిదా వేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. రమేష్ వర్మ డైరెకషన్లో తెరకెక్కిన ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న రిలీజ్ కావాల్సి ఉంది. సెకండ్ వేవ్ ఉధృతి వచ్చే జూన్ లో కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి కనిపించట్లేదు. జులైనాటికి ఏమైనా పరిస్థితులు అనుకూలిస్తే.. అప్పుడు రిలీజ్ చేసుకుందామని చూస్తున్నారట మేకర్స్.