- Advertisement -
కాంగ్రెస్ నాయకుడు , మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ త్వరలో వైకాపా లో చేరనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఈ నెల 13న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి వైకాపా లోకి చేరుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఈయన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కి ఎన్నిక అయ్యారు. రాజశేఖర్ రెడ్డి , రోశయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి ల మంత్రి వర్గం లో డొక్కా మంత్రి గా పనిచేశారు. గుంటూరు జిల్లా నుంచి డొక్కా మాణిక్య ప్రసాద్ చేరిక తో ఆ జిల్లా లో వైకాపా బలం పుంజుకోనున్నది.