Friday, May 17, 2024
- Advertisement -

ఇదేంది: ముస్లింలకు ప్రభుత్వ ఖర్చుతో విందులా..!

- Advertisement -

ఇఫ్తార్ విందులు ఇవ్వడానికి ప్రభుత్వాలు పోటీలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ.. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి తేడాలు లేకుండా ఇలాంటి విందులు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ ఖర్చుతో ముస్లింల కోసం భారీగా డబ్బును వెచ్చిస్తున్నాయి  ప్రభుత్వాలు.

తెలంగాణలో కేసీఆర్ భారీ ఎత్తున ఇఫ్తార్ విందును ఇవ్వగా.. బాబు ముస్లింల కోసం ప్రత్యేక చంద్రన్న తోఫా అంటూ ఉచితంగా సరుకులు ఇస్తున్నాడు. అయితే ముస్లింల కోసం ఇలాంటి ప్రత్యేక ఖర్చులు చేయడంపై హిందుత్వ వాదులు మండి పడుతున్నారు.

ఈ విషయంలో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అయినా.. కేసీఆర్ కు అయినా ఈ పని సరికాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు పుష్కరాలకు వెళ్లే హిందువుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తూ.. ఆర్టీసీ బస్సుల చార్జీలే పెంచేసి.. జనాల నుంచి డబ్బు గుంజుతూ.. ముస్లింలకు మాత్రం పండగ స్పెషల్ గా ఇలాంటి విందులు.. వినోదాలు ఏర్పాటు చేస్తారా? అంటూ హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. 

సంక్రాంతి సమయంలోనూ ఇలాంటి చంద్రన్న కానుకే ఇచ్చాడు తెలుగుదేశం అధినేత. అప్పుడు కేవలం హిందూ కుటుంబాలకే కాదు.. రేషన్ కార్డు దారులు అందరూ చంద్రన్న కానుక అందుకొన్నారు. ఇప్పుడు మాత్రం ముస్లింలకు మాత్రమే ప్రత్యేక కానుక అందిస్తున్నాడు చంద్రన్న. ఇక కేసీఆర్ అయితే ఇఫ్తార్ విందలు కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో హిందుత్వ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డ ప్రభుత్వాలకు ఇవేమీ పట్టవు కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -