టీడీపీ మాజీ ఎంపీ,నటుడు హరికృష్ణ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.హరికృష్ణ మరణవార్తతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి హరికృష్ణ మరణించాడని తెలియాగానే కొడుకులు ఎన్టీఆర్-కల్యాణ్ రామ్లు షాక్ గురైయ్యారు.హరికృష్ణ మరణానికి అతివేగమే కారణమని నల్గొండ పోలీసులు తెలిపారు.ఇక హరికృష్ణ మరణానికి మరోకటి కూడా కారణం అని తెలుస్తుంది.ప్రమాద సమయంలో హరికృష్ణే కారు నడుపుతున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.
అతివేగంగా వెళ్తున్న కారు వెనక సీటులో ఉన్న వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారట హరికృష్ణ.దీంతో కారు అదుపు తప్పి బొల్తా కొట్టి ఎదురు వస్తున్న మరో కారుని ఢీ కొట్టింది.తీవ్ర గాయాలు పాలైన హరికృష్ణను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అప్పటికే తీవ్ర రక్తసావ్రం కావడంతో హరికృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు.వాటర్ బాటిల్ ఎన్టీఆర్ కుటుంబంలో మరో రోడ్డు ప్రమాదానికి కారణం అయిందని అక్కడి వారు చర్చించుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=-wK858hLr1M