గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో తెలుగు దేశం కి చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణా మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ని అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్న చంద్రబాబు తమ సొంతా రాష్ట్ర రాజధాని అయిన అమరావతి విషయంలో సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అనేది ఆయన వేసిన ప్రశ్న మరొక పక్క కెసిఆర్ సైతం చంద్రబాబు ని మాటలతో ఆడుకుంటూ ఉండగా ఇప్పుడు హరీష్ రావు సైతం బాబు ని ఇరకాటం లో పెట్టేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల పర్వం లోకి కాస్త లేట్ గా వచ్చినా ఇరగ దీస్తున్నారు హరీష్.శ్రీశైలం ప్రాజెక్టునుంచి హైదరాబాదు నగరానికి తాగునీటిన సరఫరా చేయడానికి ఎత్తిపోతల ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించినప్పుడు.. దానిని అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నించలేదా అనే పాయింటును ఇప్పుడు ఆయన తెరమీదకు తెస్తున్నారు.
దీంతో చంద్రబాబు కాదు కదా టీడీపీ లో ఎవ్వరూ దీనికి సమాధానం చెప్పలేక పోతున్నారు. హరీష్ రావు తెలంగాణా నీటి పారుదలశాఖ మంత్రి అవ్వడం తో ఈ శాఖ కి సంబంధించిన ఐడియా బాగా ఉంది, సో ఫుల్ క్లారిటీ తో చంద్రబాబు ని ఇబ్బందుల్లోకి నెట్టారు ఆయన. హైదరాబాదుకు తాగునీళ్లు అందించే, గండిపేట, హిమాయత్సాగర్ రిజర్వాయర్లకు తాగునీటిని అందించడానికి కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేశారు. దానికి ఏపీ ప్రభుత్వం అడ్డం పడింది.