Sunday, April 28, 2024
- Advertisement -

ఇటు ఎండలు.. అటు పొగమంచు!

- Advertisement -

వాతావరణం ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో ఎవరం చెప్పలేం. ఇప్పుడు.. విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో పరిస్థితి కూడా ఇందుకు తగ్గట్టే ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు ఈ ఏడాది ముందుగానే మండిపోతున్నాయి. జనం బయట తిరగాలంటే.. భయపడిపోతున్నారు.

కానీ.. విశాఖ జిల్లా పాడేరులో సిచువేషన్ పూర్తి డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఇప్పటికీ పొగ మంచు కురుస్తుండడం.. ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీలకు మించకపోడంతో.. అక్కడి ప్రజలు హాయిగా ఉంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న టూరిస్టులు కూడా పాడేరు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాట్లు తక్కువగా ఉన్న కారణంగా… టూరిస్టులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి సమయాల్లో.. పర్యాటకంగా ఏర్పాట్లు ఉంటే.. ఇటు జనానికి కాస్త ఉపశమనం.. అటు ప్రభుత్వానికి ఆదాయం రెండూ కలిసొస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -