సినీ నటి, బిజెపి ఎంపి హేమమాలినికి కారు యాక్సిడెంట్ జరిగింది. రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో హేమమాలినికి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమమాలిని తలకు గాయాలయ్యాయి.
వెంటనే అమెను జైపూర్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా హాస్పిటల్కు తరలించారు. హేమమాలినికి కుడి కనుబొమ్మ వద్ద గాయమైంది. ముఖమంతా రక్తసిక్తమైంది. మధుర లోక్సభ స్థానం నుంచి ఎంపికైన హేమమాలిని గురువారం జైపూర్ వెళుతుండగా..
దౌసా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈమె ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొట్టడంతో ఆల్టో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒక పాప చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.