- త్రినాథరావుతో ఎనర్జిటిక్ హీరో సినిమా
ఉన్నది ఒకటే జిందగీతో సంతోషంలో ఉన్న యువ నటుడు రామ్ పోతినేని తన తర్వాత సినిమాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తన ఎనర్జిక్ నటనతో సినిమా విజయానికి కావాల్సినంత కష్టపడతాడు. కానీ విజయాల కన్నా అపజయాల సంఖ్య ఎక్కువున్నాయి. అయినా దిగాలు చెందకుండా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి ఉన్నది ఒకటే జిందగీతో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు తన మరో సినిమా పనిలో నిమగ్నమయ్యాడు.
‘సినిమా చూపిస్త మామ, నేను లోకల్ ’ సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ సినిమా చేయనున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసి, ఈ టీమ్తో పని చేయడం ఎంతో ఎక్సయిటింగ్గా ఉందని చెప్పాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్నాడు. ఈ సినిమా 2018 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.