Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణాలో దారుణ‌మైన మ‌రో ప‌రువు హ‌త్య‌..

- Advertisement -

టెక్నాల‌జీ ఎంత అభివృద్ధి చెంతున్నా ప‌రువు హ‌త్య‌లు ఆగ‌డంలేదు. ప‌రువు కోసం త‌ల్లి,దండ్రులు సొంత బిడ్డ‌లు అని చూడ‌కుండా కిరాత‌కంగా హ‌త‌మారుస్తున్నారు. త‌మ అభిమ‌తానికి వ్య‌తిరేకంగా క‌లాంత‌ర వివాహాలు చేసుకుంటుండంతో క‌నిక‌రం లేకుండా క‌న్న బిడ్డ‌ల చంపుకుంటున్నారు. తాజాగా తెలంగాణాలో మ‌రో ప‌రువు హ‌త్య చోటు చేసుకుంది. నందకిషోర్‌ అనే వ్యక్తిని భార్య తరపు బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.

వివ‌రాల్లోకి వెల్తే…నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి త‌ల్లి,దండ్రుల‌కు ఇ వివాహం ఇష్టం లేక‌పోవ‌డంతో నంద‌కిషోర్‌ను చంపేదానికి ప్లాన్ వేశారు. నందకిశోర్ ను వదిలి వచ్చేయాలనీ, మళ్లీ వివాహం చేస్తామని అశ్వినికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ లో చెప్పేవారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి.

దీంతో బాబును తీసుకుని అశ్విని పుట్టింటికి వచ్చేసింది. దీంతో పంచాయితీ కోస‌మ‌ని నందకిషోర్‌ను ఇంటికి పిలిపించారు. అల్లుడికి పూటుగా మద్యం తాగించిన బావ‌మ‌ర‌ది మ‌హేశ్వ‌ర్‌… అనంతరం పక్కా ప్రణాళికతో అతని తలపై బండరాయితో మోది హత్యచేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -