Friday, April 26, 2024
- Advertisement -

డ్ర‌గ్స్ సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎలా చేరింది.. సూత్ర‌ధారులు ఎవ‌రు…?

- Advertisement -

టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్ర‌గ్స్ మాఫియా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.డ్ర‌గ్స్ మాఫియాకు కేరాఫ్‌గా హైద‌రాబాద్ మారింద‌ర‌న‌డంలో సందేహంలేదు.స్కూల్లు,కాలేజీలు ఇలా ప్ర‌తీ వ్య‌వ‌స్థ‌లోకి ఈకిల్ల‌ర్ ప్ర‌వేశించింది.అస‌లు సినిమా ఇండ‌స్ట్రీకి డ్ర‌గ్స్ ఎలా చేరిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
హైదరాబాదులో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న పీయూష్ అనే వ్యక్తి ని పోలీస‌లు అరెస్ట్ చేశారు.దీంతో దిమ్మ‌తిరిగే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.మల్కాజిగిరికి చెందిన పీయూష్ ఇంజినీరింగ్ చేసే సమయంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని తెలిపారు.ఇంటర్నెట్ ద్వారా ఎల్ఎస్‌డిని కొనుగోలు చేసేవాడన్నారు. డ్రగ్స్ పైన ఇంటర్నెట్ రీసెర్చ్ చేశాడని తెలిపారు.
ఇక సొంతంగా డ్ర‌గ్స్‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు.అతని నుంచి 400 గ్రాముల కొకైన్, 80 ఎల్ఎస్డీలు, 20 గ్రాముల గంజాయి,150 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వయాగ్ర, యాంటీ డిప్రెషన్ మందులు, కెఫెన్, నిద్రమాత్రలు కలిపి లోకల్ మేడ్ ఎల్ఎస్సీడీ ప్యాకెట్లను తయారు చేసేవాడన్నారు. విదేశాల నుంచి తెప్పించిన సరుకుకు సమానంగా మత్తు వచ్చేలా వీటిని తయారు చేసేవాడు.
దీన్ని త‌యారు చేడం ఒక వంతు అయితే దాన్ని స‌ర‌ప‌రా చేయ‌డం క‌ష్టం.త‌యారు చేసిన డ్ర‌గ్స్‌ రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస రావు జీశాన్ నుంచి డ్రగ్స్ తీసుకునే వారని ప్రచారం సాగుతోంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ జగన్నాథ్‌కు కెల్విన్ సరఫరా చేసేవాడని చెబుతున్నారు. జగన్నాథ్ ద్వారా చార్మీ, సుబ్బరాజులకు అలవాటు అయినట్లుగా జోరుగా ప్రచారం సాగింది.సినీ పెద్ద‌లు ఈనిజాల‌ను బ‌య‌ట‌కు పొక్క‌నిస్తారా అన్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -