విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన అధ్యాపకుల బుద్ధి గడ్డితింది. పవిత్రమైన వృత్తిలో ఉంటూ.. తమ కోరిక తీరిస్తేనే ప్రాక్టికల్స్లో మార్కులు మంచిగా వేస్తామని.. లేకుండా నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేస్తామని వేధించారు. నగరశివారు అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ హెచ్వోడీ.. మరో ఇద్దరేమో స్కాలర్షిప్, డిప్లొమా ఇన్చార్జీలు ఉన్నారు.
ఒక్కరాత్రికి రూ.లక్ష ఇస్తామంటూ విద్యార్థినులకు మెసేజ్లు పెట్టారు. ఇలా నాలుగు నెలలుగా వేర్వేరుగా ముగ్గురు విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భరిస్తూ వచ్చిన ఆ ముగ్గురు విద్యార్థులు స్నేహితుల సాయంతో ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన ఏబీవీపీ.. కళాశాల వద్దా ధర్నా చేయడంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్ హెచ్వోడీ సైదిరెడ్డి వెన్న, డిప్లొమా ఇన్చార్జి గోపి, స్కాలర్షిప్ ఇన్చార్జి ఉస్మాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో ముగ్గురు విద్యార్థినులు ముగ్గురు ప్రొఫెసర్లు ఫేస్బుక్, వాట్స్ప్లలో తమకు పంపిన మెసేజ్లను షీటీమ్స్కు అందజేశారు. ఈ మెసేజ్లలో చాలా అసభ్య రాతలు ఉన్నట్టు తెలుస్తోంది. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు వినాలి – నైటు లైంగిక వాంఛ తీర్చితే రూ.లక్ష ఇస్తా. అంతేకాదు.. ఇంజనీరింగ్ పట్టాకూడా నీ చేతిలో ఉంటుందన్న సందేశాలు ఉన్నాయట. ఇక సదరు ప్రొఫెసర్లపై గతంలోనే కొందరు విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
{youtube}fJVcw_VHOQQ{/youtube}
Related