Monday, April 29, 2024
- Advertisement -

లాక్ డౌన్ పెట్టకపోతే.. మేమే పెడతాం: హై కోర్టు

- Advertisement -

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం అన్నివిధాలుగా పర్యవేక్షిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి వివరించగా.. పర్యవేక్షణ కాదు, చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.

కరోనాపై ప్రజలకు అన్నీ తెలిసిపోయాయని.. ప్రభుత్వానికే తెలియాలని వ్యాఖ్యానించింది. రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని.. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల విషయంలో చర్యలేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నింపలేకపోతోందన్న హైకోర్టు.. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? అని వివరణ కోరింది.

అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్​బర్మన్ కన్నుమూత

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

హై కోర్టు వరుస ప్రశ్నలు.. కరోనా కి బార్ లకి ఏమిటి లింక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -