Monday, April 29, 2024
- Advertisement -

అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్​బర్మన్ కన్నుమూత

- Advertisement -

అసోం మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూమిధర్​బర్మన్​(91) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1931 అక్టోబర్ 12న అసోంలోని బెల్సోర్‌ (అప్పటి బ్రిటిష్ ప్రెసిడెన్సీ)లో జన్మించిన బర్మన్.. 1951లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా (అసోం, బొర్ఖెట్రి నియోజకవర్గాల నుంచి) ఎన్నికైన బర్మన్.. 1996లో అసోం ముఖ్యమంత్రి అయ్యారు.

1996 ఏప్రిల్​ 22 నుంచి అదే ఏడాది మే 14 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2010లో మరోసారి బర్మన్ సీఎం అయ్యారు. 2010లో అప్పటి సీఎం తరుణ్ గోగోయ్ హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లిన సమయంలో బర్మన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015లో రాష్ట్ర మంత్రిగానూ బర్మన్​ సేవలందించారు.గతంలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థలు మూడు సార్లు ఆయనపై దాడి చేశాయి.

బర్మాన్ ఎన్ఆర్సీ పద్ధతుల రూపకల్పనలో క్యాబినెట్ ఉప కమిటీకి నాయకత్వం వహించాడు. మాజీ మిలిటెంట్ సంస్థ బోడో లిబరేషన్ టైగర్స్ తో శాంతి ఒప్పందంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ర్మన్ బలమైన అట్టడుగు వర్గాల నేతగా ఎదిగారు.గతంలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థలు మూడు సార్లు ఆయనపై దాడి చేశాయి.

బర్మన్ మృతదేహాన్ని పూర్తి రాష్ట్ర గౌరవ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాం కాంగ్రెస్‌కు మార్గదర్శక కాంతిలాగా ఉన్న బర్మన్ మరణానికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు.

అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్​బర్మన్ కన్నుమూత

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

కరోనాతో బీహార్ మాజీ మంత్రి కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -