Monday, April 29, 2024
- Advertisement -

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

- Advertisement -

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద సంయలో లారీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు.. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్‌ మార్కెట్‌కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.

మృతుల్లో కళాకుమార్ సునా (20), కృపా సునా (25), గోపాల్‌ దీప్‌ (25), బుదన్‌ (25), హస్తా యాదవ్‌ (55)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50మంది కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కరోనాతో బీహార్ మాజీ మంత్రి కన్నుమూత!

‘సర్కార్ వారి పాట’ షూటింగ్ లో కరోనా కలకల..

కన్నీరు పెట్టుకుంటున్న సినీనటి.. అందమైన ముఖం.. అందవికారంగా మార్చిన బ్యూటీషియన్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -