ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు. ఈ వ్యవహారంలో ఆయనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ నామినేటెడ్ ఎమ్మెల్యే మా గొప్ప డైలాగులే చెప్పాడు. తను నిజాయితీగా వ్యవహరించానని.. చెప్పుకొచ్చిన ఆయన దేనికీ భయపడలేదు అని ప్రకటించాడు. అలా ప్రకటిస్తూనే ఒక భారీ డైలాగును వదిలాడాయన!
ఓటుకు నోటు వ్యవహారం బహిర్గతం కావడంలో కీలక పాత్ర పోషించినందుకు తనపై కొంతమంది కక్ష కట్టి ఉండవచ్చని స్టీఫెన్ సన్ అన్నాడు. అలాంటి వారు తనను ఏమైనా చేయడానికి ప్రయత్నించినా ప్రయత్నింవచ్చని కూడా తన వారు తన దగ్గర ఆందోళన వ్యక్తం చేశారని ఈ ఎమ్మెల్యే వివరించాడు. అయితే తనకు అలాంటి భయం లేదని ఆయన అన్నాడు. ఇదే ఆవేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒక స్టీఫెన్ సన్ ను అంతం చేస్తే.. వేలమంది స్టీఫెన్ సన్ ను పుడతారని .. అని వ్యాఖ్యానించాడు!
మరి ఇది చాలా బరువైన డైలాగే. అల్లూరి సీతారామారాజు లెవల్లో ఈయన డైలాగ్ చెప్పాడు. తన జీవితంలో ఎప్పుడూ కోటి రూపాయల మొత్తాన్ని కళ్లతో చూడలేదని.. తను ఇంత వరకూ అంత డబ్బు కూడా సంపాదించలేదని.. అయినా కూడా అంత డబ్బుతో ప్రలోభ పెట్టినా తను తలొగ్గలేదని ఈ నామినేటెడ్ ఎమ్మెల్యే చెప్పుకురావడం విశేషం.