Thursday, May 16, 2024
- Advertisement -

టాస్ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా….

- Advertisement -

కేప్‌ టౌన్ వేదికగా కొద్ది సేప‌ట్లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న భారత్ జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై గెలుపొందలేదు. దీంతో.. ఈ పేలవ రికార్డును చెరిపేయాలని కోహ్లి సారథ్యంలో టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

మరోవైపు రెండేళ్ల క్రితం.. భారత్‌లో టెస్టు సిరీస్ చేజార్చుకున్న సఫారీలు.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. వన్డే, టీ20ల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన జస్‌ప్రీత్ బుమ్రా భారత టెస్టు జట్టులోకి ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ​ గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత.. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.

భారత జట్టు: శిఖర్ ధావన్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ వర్మ, సాహా, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -