నిత్యం భారత్ను దొంగదెబ్బతీసె దాయాది ధేశం పాకిస్థాన్కు భారత్ ఆర్మీ దెబ్బ ఏంటో రూచిచూపించింది.పాక్ దొంగ చాటుగా దెబ్బతీస్తె… భారత్ మాత్రం డైరెక్ట్గా దాడిచేసి చుక్కులు చూపించింది. ఇన్నాల్లు శాం వచనాలు పాటిస్తున్న భారత్ దెబ్బకు దెబ్బ వన్నట్లుగా పాకిస్థాన్కు చెందిన బంకర్ను నిమిషంలో నామరూపాల్లేంకుండా చేసి తన సత్తా ఏమిటో నిరూపించింది.ఇప్పుడు ఈ వీడియే సోషియల్ మీడియాలో వైరల్మారింది.
దేశ సరిహద్దులు దాటుకుని 250 మీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, భారత సైనికుల దేహాలని చిద్రం చేసిన పాక్ సైన్యానికి పరోక్షంగానే గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్.
తాము తలుచుకుంటె ఏమైనా చేయగలమని లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖని ఆనుకుని పాక్ భూభాగంలో వున్న పాక్ సైన్యం బంకర్ని విజయవంతంగా పేల్చేసింది భారత సైన్యం …ఇది శాంపిల్ మాత్రమే నని పాక్ తన కుటిల బుద్ది మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ దాడితో హెచ్చరించింది.ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ కేవలం 60 సెకన్లలోనే పాక్ బంకర్ని నేలమట్టం చేసిన దృశ్యం, సైనికులు జరిపిన ఈ ఆపరేషన్కి సంబంధించిన వీడియో ఇది.
తాము ప్రతీకా దాడులకి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని పాకిస్థాన్ని హెచ్చరించడానికే ఇండియన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ, ఆర్మీ జవాన్ల దారుణ హత్యకు ప్రతీకారణంగానే భారత సైన్యం ఈ దాడి చేసి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మేజర్ గౌరవ్ ఆర్య కూడా తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్టు చేస్టు చేశారు. ఆర్మీ వర్గాల నుంచి ఈ వీడియో వచ్చిందని, ఇది దాదాపు గత 48గంటల్లోపు జరిగిన దాడి అని ఆయన వివరించారు. పాక్కు తన భాషలోనే భారత్ సమాధానం చెప్పిందని అన్నారు.
క్రిష్ణఘాటి సెక్టార్ లో పాకిస్థాన్ దాడులకు పాల్పడగా, వాటిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం ఏకంగా రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. పాక్ బంకర్లను సమూలంగా నాశనం చేసేలా బాంబులేసింది. ఆపై చెల్లాచెదరై బయటకు వస్తున్న పాక్ సైనికులపై తూటాల వర్షం కురిపించగా, ఏడుగురు మరణించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ దాడిని భారత సైనికాధికారులు రెండో సర్జికల్ స్ట్రయిక్స్ గా అభివర్ణిస్తున్నాయి.
Related