Thursday, May 16, 2024
- Advertisement -

కేసీఆర్ పై అటాక్ చేయడానికి ప్రతిపక్షాలకు మరో అస్త్రం!

- Advertisement -

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతిపక్షాల వాళ్లు. అటు కాంగ్రెస్ , ఇటు తెలుగుదేశం పార్టీలు అనునిత్యం ఏదో విధంగా కేసీఆర్ ను విమర్శిస్తూనే ఉన్నాయి.

కేసీఆర్ పాలనావిధానంలోని లోపాలను ఆధారంగా చేసుకొని వారు విరుచుకుపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ పై ధ్వజమెత్తడానికి ప్రతిపక్ష పార్టీలకు మరో అస్త్రం దొరికింది. ఈ అస్త్రాన్ని స్వయంగా కేసీఆరే అందించాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. తాజాగా కేసీఆర్ తన కాన్వాయ్ లోకి ఐదు కొత్త వాహనాలను కొన్నాడు. వీటిలో ఒక్కోదాని విలువ కోటీ పదిలక్ష రూపాయలనమాట. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒక్కోదానికి కోటీ పదిలక్షల రూపాయలను వెచ్చించి ఐదున్నర కోట్ల రూపాయలతో ఐదు వాహనాలను కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించాడు.

ముఖ్యమంత్రి అయిన కొత్తలో నాలుగు కోట్ల రూపాయలతో నాలుగు ఫార్చూనర్లను కొన్నారు. అయితే ఆ రంగు నచ్చక వాహనాలను మార్పించారు. దాని కోసం భారీగా డబ్బు ఖర్చు అయ్యింది. మరి ఇప్పుడు మళ్లీ ఐదున్నర కోట్ల రూపాయలతో వెహికల్స్ కొన్నారు. మొన్నమధ్య కూడా రెండు ల్యాండ్ క్రూయిజర్లనే కొన్నారు. ఇక ఐదు కోట్ల రూపాయలు విలువ జేసే ఒక బస్సు.. రక్షక్ వాహనం ప్రత్యేకం. ఈ విధంగా ప్రజల సొమ్ముతో తెలంగాణ ముఖ్యమంత్రి పండగ చేసుకొంటున్నట్టుగా ఉన్నాడు. ఇక ప్రతిపక్షాలు విరుచుకుపడవా మరి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -