Monday, May 13, 2024
- Advertisement -

పలు ఐటి కంపెనీలతో చర్చలు

- Advertisement -

తెలంగాణ ఐటి శాఖా మంత్రి కె.తారక రామారావు శుక్రవారం నాడు అమెరికా వెళ్లారు. అయితే అధికారిక పర్యటన మాత్రం ఈ నెల 23 నుంచే ప్రారంభమవుతుంది. జూన్ 3 వరకూ కెటిఆర్ అమెరికాలోనే ఉంటారు. అక్కడాయన పలు ఐటి సంస్ధలకు చెందిన ప్రముఖులను కలిసి తెలంగాణాలో వారి కంపెనీల స్ధాపనపై చర్చిస్తారు.

కాలిఫోర్నియా, చికాగోల్లో ఉన్న కంపెనీల వారితో కెటిఆర్ సమావేశమవుతారు. తెలంగాణలో స్టార్టప్ రంగాన్ని మరింత పెంచడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ అర్బన్ క్లీన్ ఎనర్జి సదస్సులో కూడా కెటిఆర్ పాల్గొంటారు. జూన్ 3 తన పర్యటన ముగించుకుని 4 లేదా 5 వ తేదిన కెటిఆర్ హైదరాబాద్ వస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -