Sunday, May 19, 2024
- Advertisement -

సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేయిస్తూ పథకాలు ఆపుతున్నారని ఆరోపించారు. రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్‌….మేనిఫెస్టోతో ఊదరగొడుతున్న చంద్రబాబు గతంలో ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం పేరైనా గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు.

అసలు సైకిల్ కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు.. ఎన్ని రిపేర్లు చేసినా లాభం లేదు అని ఎద్దేవా చేశారు. సైకిల్ లో పనిచేసే ఒకే ఒక్క పార్ట్ బెల్.. అది మేనిఫెస్టోలోని అబద్ధాలను ప్రచారం చేస్తుందని చురకలు అంటించారు. సైకిల్ రిపేర్ చేయడానికి దత్త పుత్రుడిని ఆశ్రయించినా ఫలితం లేకపోయిందన్నారు.

ఢిల్లీ మెకానిక్ లు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు..అయినా లాభం లేదన్నారు. పొరపాటున చంద్రుబాబుకు ఓటు వేస్తే చంద్రబాబును నిద్రలేపడమే అవుతుంది..సంక్షేమానికి బ్రేక్ పడుతుందన్నారు. టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే..ఓటు మాత్రం వైసీపీకే వేయాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -