Friday, March 29, 2024
- Advertisement -

జల్లికట్టు కి నిండు ప్రాణం బలి.. విషాదం లో కుటుంబ సభ్యులు..!

- Advertisement -

జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో నిర్వహించిన ఈ ఎద్దుల పోటీ.. ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది. అలంకనల్లూర్​లో శనివారం జరిగిన జల్లికట్టు పోటీలకు నవమణి అనే వ్యక్తి తన స్నేహితుడి ఎద్దును తీసుకొని వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ ఎద్దు తిరగబడింది. నవమణిపై దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది.

తీవ్రంగా గాయపడిన నవమణికి అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో తొలుత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -