- Advertisement -
జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో నిర్వహించిన ఈ ఎద్దుల పోటీ.. ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది. అలంకనల్లూర్లో శనివారం జరిగిన జల్లికట్టు పోటీలకు నవమణి అనే వ్యక్తి తన స్నేహితుడి ఎద్దును తీసుకొని వచ్చాడు. అయితే ఒక్కసారిగా ఆ ఎద్దు తిరగబడింది. నవమణిపై దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది.
తీవ్రంగా గాయపడిన నవమణికి అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో తొలుత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.