టీడీపీకీ ఇప్పుడు ఓటమి కంటె జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలే ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలె జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో బాబుపై అన్ని వర్గాలనుంచి విమర్శల తాకిడి పెరిగిపోయింది. ప్రస్తుతం బాబు పని అయిపోయిందని ఇక పార్టీని నందమూరి వారసులు తమ చేతుల్లోకి తీసుకోవాలని అన్న అభిమానులు కొందరు టీడీపీ సీనియర్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. కొడాలని నాని అయితే నందమూరి వారసుల్లో ఎవరికైనా దమ్ముంటె పార్టీని చేతుల్లోకి తీసుకోని బ్రతికించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బాబు తరువాత టీడీపీనీ నడిపించే సత్తా లోకేష్కు లేదని తేలిపోయింది. ఎమ్మెల్యేగా గెలవలేని చినబాబు పార్టీని ఏం నడుపుతారనె విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు చంద్రబాబు మీద సొంత పార్టీలోనే లోలోపల అసమ్మతి జ్వాలలు చెలరేగనా ఇంకోవైపు ఇప్పటికీ మారని లోకేష్ చేస్తున్న మాటల డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇక బాబుకు కూడా వయసు మీద పడంతో పార్టీ బాధ్యతలు చూసుకోవడం కష్టమనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ముందుకు నడిపించాలంటె ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అన్న వాదన బలంగా వినిపిస్తోంది.
సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ ఈ రోజు హైదరాబాద్ లోని అన్న గారి ఘాట్ వద్దకు వచ్చి చేశారని చెబుతున్న కొన్ని కామెంట్స్ టీడీపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. జూనియర్ వచ్చటాలకు ఎన్టీఆర్ ఘాట్ను శుభ్రం చేయకుండా అట్లే ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.వెంటనే తన అనుచరులతో సమాధిని శుభ్రం చేసి మరీ అక్కడ పుష్ప గుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారని టాక్. ఈ సందర్భంగా జూనియర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇకపై అన్న గారి జయంతులు, వర్ధంతులు నేనే దగ్గరుండి చూసుకుంటానని, అన్న గారి ఘాట్ పనులను కూడా నేనే చూస్తానంటూ జూనియర్ చెప్పిన మాటలు టీడీపీకి మరోలా అర్ధమవుతున్నాయట. ఇక నుంచి టీడీపీని నేనే చూసుకుంటాను అని జూనియర్ అంటున్నట్లుగా టీడీపీ నేతలు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. మని జూనియర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో అప్పటి వరకు టీడీపీ ఎదురీడటం తప్ప చేసేదేమిలేదు.