కర్నాటక ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా వెల్తున్న భాజాపాకు అడ్డుకట్ట పడింది. ఫలితాలు చివరకు వచ్చేకొద్దీ తీవ్ర ఉత్కంఠం రేపుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు చూసుకుంటే భాజాపా 108, కాంగ్రెస్ 72, జేడీఎస్ 39 లీడింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 112ను ఏపార్టీ అందుకునే స్థాయిలో లేనందున హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జేడీఎస్ కీలకంగా మారింది. మొదటి నుంచి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతాదని పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలు నిజమయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితం అయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాజాపాకు జేడీఎస్ మద్దతు తప్పనిసరి కానుంది.