Saturday, May 18, 2024
- Advertisement -

క‌ర్నాట‌క‌లో వంద‌కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత‌..

- Advertisement -

క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌ల వేల భారీగా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. త‌నిఖీల్లో భాగంగా చిక్‌ బల్లాపూర్‌.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క‌ర్నాట‌క‌లో క‌ల‌క‌లం రేగింది.

ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -