Friday, May 17, 2024
- Advertisement -

లోకేశ్‌కు అంత సీన్ లేదట!

- Advertisement -

టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు కేసిఆర్‌పై గల్లీ నాయకుడు అని వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో కేసిఆర్ కుమార్తె ఎంపి కవిత స్పందించారు.

కేసిఆర్ గారిని విమర్శించాలంటే స్థాయి, అనుభవం ఉండాలి. ఆ రెండూ లోకేశ్‌కు లేవని, తమ మాదిరి ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడేం కాదని, అలాంటి వారికి విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. ఒక వ్యక్తిగత సమస్యని చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యగా మార్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వ్యవహారం చంద్రబాబు అవినీతికి పాల్పడి దొరికిన వ్యవహారం మాత్రమేనని, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సంబందం లేదన్నారు. కానీ టిడిపి రాష్ట్రాల సమస్యగా మార్చి లబ్ది పొందాలని చూస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -