జనసేన అధినేత పై తెలంగాణా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏగూటి పక్షులు ఆగూటికే చేరుతాయన్న చందంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రసంగం వింటే అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు.
ఆంద్రప్రదేశ్ విభజన తరువాత పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం తినలేదని వ్యాఖ్యానించారని అన్నారు.ఈ మాటలకు తెలంగాణ ప్రజలు భాదపడరా అని ప్రశ్నించారు.ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేటీఆర్ ఈ వ్యాఖలు చేశారు.ఏపీ నేతలంతా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కు ఎవరికీ చిత్తశుద్ధిని లేదని అన్నారు.
ఏపీకి ఇన్ని విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, ప్యాకేజ్ లు వస్తున్నాయంటే అది కేవలం టిఆర్ ఎస్ వల్లనే అని అన్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం వల్ల ఏపీ అనేక ప్రయెజనాలను పొందుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు టిఆర్ ఎస్ న్యాయం చేయగలదని కేటీఆర్ చెప్పడం విశేషం.