Saturday, May 4, 2024
- Advertisement -

కేసీఆర్ కుటుంబం అందులో ఏనుగులా బలిసింది..

- Advertisement -
kcr family became fatty like elephant in doing that :madhu yashki

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అవకాశం కుదిరినప్పుడల్లా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతుంటే, గులాబీ పార్టీ అందుకు బదులిస్తూనే ఉంది. అయితే తాజాగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ లీడర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శలతో విరుచుకుపడ్డారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఏనుగులా బలిసిందంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు కాపలా కుక్కల్లా అవినీతి ఏనుగు వెంటపడుతున్నాయని మధుయాష్కి అన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెంబర్ వన్‌గా ఉందని, కేటీఆర్ మంత్రి అయ్యాక తెలంగాణ విద్యార్ధులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు డబ్బులు లేకపోయినా రూ. 50 కోట్లతో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు మధుయాష్కి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -