Friday, May 10, 2024
- Advertisement -

కేసీఆర్ కు బాబు ప్రామిస్!

- Advertisement -

ఆయత చండీయగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇవాళ (14-12-15) ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ వెళ్లిన కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును యాగానికి ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరారు. ఇందుకు స్పందించిన బాబు.. తప్పక చండీ యాగానికి హాజరవుతానని ప్రామిస్ చేశారు.

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను వెంట బెట్టుకుని విజయవాడ చేరుకున్న కేసీఆర్ కు.. ఏపీ మంత్రులు యనమల, కామినేని, రావెల కిషోర్ బాబు వెల్ కమ్ చెప్పారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లారు. అప్పటికే కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు.. పుష్పగుచ్ఛం ఇచ్చి కేసీఆర్ కు వెల్ కమ్ చెప్పారు.

రీసెంట్ గా… ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా.. కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించారు.. చంద్రబాబు. అప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా తానే అమరావతికి వెళ్లి.. శుభాకాంక్షలు తెలిపారు.. కేసీఆర్. ఇప్పుడు బాబు కూడా కేసీఆర్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ.. చండీయాగానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -