- Advertisement -
తిరుపతి వెంకన్న స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులని తీర్చనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాకారం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ మొక్కులని తీరుస్తున్నాడు కేసీఆర్.
ఇప్పుడు తిరుమ శ్రీవారికి సాలగ్రామ హారం, కంఠాభరణాలను సమర్పించనున్నారు. ఈ రోజు తిరుపతి వెళ్ళి.. బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులని తీర్చనున్నారు. ఆ రాత్రి తిరుపతి కొండపైనే సీఎం కేసీఆర్ బృందం బస చేస్తోంది. 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం, కంఠాభరణాలను శ్రీవారి సమర్పించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటన క్రమంలో.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లని చేశారు. సీఎం పర్యటనని ఐఏఎస్ రమణాచారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.