- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోదరి మరణవార్త తెలుసుకుని అర్థాంతరంగా ముగించి హైదరాబాద్కు పయనమయ్యారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. లీలమ్మ మృతివార్త తెలుసుకున్న కేసీఆర్ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.