Saturday, May 4, 2024
- Advertisement -

తెలుగుసినిమా మొత్తం పారితోషికాన్ని కేర‌ళకు ఇస్తానన్న‌ ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే ..

- Advertisement -

కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. జలదిగ్బంధంలో చిక్కుకున్న వేలాది మంది ప్రజలు సాయం కోసం దీనంగా అర్థిస్తున్నారు. చుట్టూ నీళ్లున్నా.. తాగడానికి నీళ్లు లేని దైన్య స్థితి. ఆహారం లేక అలమటిస్తున్నారు. వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబసభ్యులు ఆ మృతదేహాలతో వరద నీటిలోనే సహవాసం చేస్తున్నారు.

Image result for poonam-pandey

వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోడానికి చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ముందుకొస్తున్నారు. కేంద్రంతో పాటు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలువురు ప్రముఖులు, నటీనటులు కేరళ కోసం ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు కూడా కేరళకు తమకు తోచినంత సాయం అందించారు.

తాజాగా బాలీవుడ్ నటి, ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే కూడా కేరళ వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చారు. తెలుగులో దర్శకుడు వీరు కెతో ఓ సినిమా చేయడానికి పూనమ్ ఇటీవలే అంగీకరించింది. ‘లేడీ గబ్బర్ సింగ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ మొత్తాన్ని కేరళ బాధితుల కోసం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపింది. వరద బాధితులను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆమె పేర్కొంది. కేరళ ప్రజలను ఆదుకోడానికి మిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ముందుకు రావాలని పూనమ్ ట్వీట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -