Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీలో చేరిన కోట్ల కుటుంబం..

- Advertisement -

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో టీడీపీ జోరు కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ పార్టీలోకి వ‌స‌లు ఊపందుకుంటున్నాయి. కర్నూలు జిల్లా కొడమూరులో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకుంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కోట్ల, కేఈ కుటుంబాల మధ్య మొన్నటివరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంద‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అలాంటిది కేఈనే స్వ‌యంగా కోట్ల‌కు ప‌చ్చ‌కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -