- Advertisement -
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు తమ నచ్చిన రీతిలో గణేషుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే విజయవాడలో మాత్రం అందుకు విరుద్ధంగా చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడంతో కలకలం రేపింది.
నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తున్న నలుగురు మహిళలు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 290,294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.