డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కి ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆయన చేసిన ప్రోగ్రాం మానేజ్మెంట్ కి బోలెడన్ని ప్రసంసలు దక్కాయి. సాక్షాతూ కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు – సురేష్ ప్రభు లాంటి వారు ప్రసంసలు ఇవ్వడం గమనార్హం.
పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కృష్ణా పుష్కరాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అనుకున్నది మొదలు బోయపాటి అన్ని తానే అయ్యి అంత భుజాన వేసుకున్నారు. హారతి కార్యక్రమాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి దానిని సక్సెస్ చేసేందుకు ఎంతో శ్రమించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
కృష్ణా – గోదావరి నదులు కలిసే సంగమ ప్రాంతంలో నదికి మధ్యలో ఎనిమిది బోట్లను ఒకచోట చేర్చి వేదిక ఏర్పాటు చేసి అద్భుతమైన రీతిలో దానిని తీర్చి దిద్ది.. కృష్ణమ్మకు తొమ్మిది రకాల హారతులు ఇచ్చేలా ఆయన వినూత్నంగా తీర్చిదిద్దారు.
Related