Monday, May 13, 2024
- Advertisement -

పలు ఐటి కంపెనీలను ఆకర్షిస్తున్న మంత్రి

- Advertisement -

అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు పర్యటన విజయవంతమవుతోంది. వంద కోట్ల పెట్టుబడితో హెల్త్ రంగంలో పెట్టుబడులకు ఓ కంపెనీ ముందుకు వచ్చింది. బుధవారం నాడు కెటిఆర్ కార్మెల్, ఇండియానాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే పనిలో పడ్డారు.

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులను వానే మరచిపోరని ఎప్పటికి అధికారాన్ని వారికి కట్టబెడుతూనే ఉంటారని ఆ సందర్భంగా కెటిఆర్ అన్నారు. అమెరికాలోని పలు మున్సిపాలిటీలపై అధ్యయనం చేస్తున్నామని, ఇది తమకు ఎంతో ఉపయోగపడుతుందని ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కెటిఆర్ అమెరికాలో తెలిపారు.

పరిపాలనలో స్మార్ట్ టెక్నాలజీని వాడకంపై ఆసక్తిని కనబరిచిన కెటిఆర్ హైదరాబాద్ లోని జీహెచ్ ఎంసిలో కూడా అమెరికాలో పాటిస్తున్న విధానాలను అనుసరించేలా చూస్తామన్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -