- Advertisement -
తనదైన శైలి లో మాట్లాడే లక్ష్మీ పార్వతి ఇప్పుడు కొత్త కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారు. అదివరకు బాలయ్య గురించి తన స్టైల్ లో మాట్లాడిన ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించీ అతని రాజకీయ భవిష్యత్తు గురించీ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవే రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారన్న లక్షమీ పార్వతి.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా నిలవడం సాధ్యం కాదని అన్నారు. ఇదే సమయంలో బాలయ్య అమాయకుడని.. ఆయనకు పార్టీని నడిపేంత శక్తి లేదని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ కూడా చాలామందిలాగే నారా చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. క్షీర సాగర మధనం ముందు విషాన్ని ఇచ్చినా తరవాత అమృతాన్ని ఇచ్చినట్టు జగన్ కి కూడా ముందు ఓటమి ఎదురు అయ్యి తరవాత గెలుపు వస్తుంది అని ఆమె పేర్కొన్నారు.