- Advertisement -
దేశ వ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికల వేల పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంపై ఆందోళన కారులు రాళ్లు రువ్వటంతో కొంతసేపు పోలింగ్ ను అధికారులు నిలిపివేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వాడంతో వారిని చెదర గొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పశ్చిమ బెంగాల్ లో మొదటి వితగా మూడు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మూడు స్థానాల్లోను 40మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.