Monday, April 29, 2024
- Advertisement -

ప్రియురాలిపై దాడి.. ఆత్మహత్యాయత్నం

- Advertisement -

ప్రియురాలి పై దాడి చేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగింది. ప్రియురాలు అరుణ ని గతరాత్రి ఇంటికి పిలిపించుకున్న ప్రియుడు రామాంజనేయులు ఆమెను పద్నాలుగు సార్లు కత్తిపోట్లు పోడిచాడు. తీవ్రంగా గాయపడిన అరుణ ప్రాణాపాయ స్థితిలో ప్రేవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే రామాంజనేయులు మార్కెటింగ్ చేస్తూ సత్లెనపల్లి పట్టణంతోపాటు పలు జిల్లాలు తిరుగుతూ ఉంటాడు. ఈ నేపధ్యంలో విజయవాడలో ప్రేవేట్ ఉద్యోగం చేసుకుంటున్న అరుణ తో రామాంజనేయులు కి పరిచయం ఏర్పడింది. ఆపరిచయం ప్రేమగా మారింది. దాంతో ఆమెను విజయవాడ నుండి తీసుకువచ్చి పిడుగురాళ్ళ లో కాపురం పెట్టాడు. వీరిద్దరి మధ్య గత మూడు ఏళ్ళ నుండి వివాహేతర సంబంధం కోనసాగుతు వస్తుంది.

అయితే, కొద్దీ రోజుల నుంచి అరుణపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఆమెను హెచ్చరిస్తూ వచ్చాడు. ఆమే ప్రవర్తనలో మార్పు రాలేదని ఆదివారం రాత్రి ఆరుణను పిడుగురాళ్ల నుంచి మా ఇంట్లో ఎవరూలేరు అంటూ సత్తెనపల్లి లోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న ఇంటికి పిలిపించు కున్నాడు. ఆమెతో కొంతసేపు పద్దతి మార్చుకోవాలని వాదించాడు. తరువాత ఆమెపై విచక్షణారహితంగా కత్తితోదాడి చేపాడు. ఆపై తనను తాను పోడుచుకున్నాడు. రామాంజనేయులు పరిస్థితి నిలకడగా ఉండగా అరుణ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -