Tuesday, May 21, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ దాడిపై స్పందించిన మ‌హేశ్ బాబు

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయ‌త్నం జ‌రిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో జ‌గ‌న్ భూజానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి.అయితే జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న గురుంచి మాట్లాడ‌రు టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి షూటింగ్‌లో ఉన్న మ‌హేశ్ బాబు జ‌గ‌న్‌పై దాడి గురించి తెలియ‌గానే స్పందించారు.

రాష్ట్ర ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌పై ఇలా దాడి చేయ‌డం చాలా దారుణం అని మ‌హేశ్ బాబు తెలిపారు.నిందితుల‌ను కఠినంగా శిక్షించాల‌ని మ‌హేశ్ కోరారు.జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తునని చెప్పారు మ‌హేశ్.ఇక జ‌గ‌న్‌పై దాడి చేసిన వ్య‌క్తి శ్రీనివాస్‌గా గుర్తించారు.ఇత‌నిది తూర్పు గోదావ‌రి జిల్లాగా స‌మాచారం అందుతుంది.శ్రీనివాస్ దాడిలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డ జ‌గ‌న్ ప్ర‌థ‌మ చికిత్స తీసుకున్న జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -