Friday, May 17, 2024
- Advertisement -

ఆ ఊరి మీద దృష్టి పెట్టిన మహేష్ బాబు – రంగం లోకి 15 న దిగుతాడు

- Advertisement -

శ్రీమంతుడు మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న సిద్దాపురం గ్రామానికి సంబంధించిన సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు తాను స్వయంగా వెళితే జనాల తాకిడి ఎక్కువ అవుతుంది అనే ఆలోచన తో కొందరు సొంత ప్రతినిధులు, మనుషులని ఆ గ్రామానికి పంపించారు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 ఆ ఊరిలో స్థానక నేతలతో వీరు సమావేశమై ప్రధానంగా ఉన్న సమస్యల మీద వాటికి తగ్గ పర్ఫెక్ట్ పరిష్కారాల మీద చర్చలు సాగించారు. భూపాల్ రెడ్డి, మధు, కృష్ణ – మహేష్ ప్రజాసేన చీఫ్ ఖాదిర్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ , ఎంపీటీసీ , గ్రామ యువకులు , నాయకులతో కలిసి సిద్దాపురం లో పర్యటించారు. 

మహేష్ బాబు 15 న గ్రామస్తులతో స్వయంగా వచ్చి మరీ మాట్లాడతారు అని అంటున్నారు. సినీ నటుడు మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -