Sunday, May 19, 2024
- Advertisement -

ఐసీయూలో మంచు విష్ణు.. ఏం జరిగింది…?

- Advertisement -

టాలీవుడు లో మంచు విష్ణుకి మంచి గుర్తింపు ఉంది. అయిన ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగులో భాగంగా అతడికి యాక్సిడెంట్ జరిగింది. కొన్ని రోజులుగా మలేషియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుండగా.. సినిమాకి సంబంధించిన బైక్ రేసు సీన్ షూట్ చేస్తుండగా.. అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణు చికిత్స పొందుతున్నాడు.

అతణ్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణుకు ఓ మోస్తరుగా గాయలైనట్లు తెలిసింది. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు షూటింగ్ కు బ్రేక్ పడనుంది. తనకు ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్లు ఇచ్చిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చేస్తున్నాడు. గతంలో ‘విక్రమార్కుడు’ సహా పలు భారీ సినిమాలు నిర్మించి.. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న సీనియర్ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

‘ఆచారి అమెరికా యాత్ర’లో మంచు విష్ణుతో పాటు బ్రహ్మానందం ప్రధాన ప్రాత్ర పోషిస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇందులో పురోహితులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కంచె’ భామ ప్రగ్యా జైశ్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికే రెండో షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా టీం కొత్త షెడ్యూల్ కోసం ఇటీవలే మలేషియాకు వెళ్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -