Sunday, April 28, 2024
- Advertisement -

దంతేవాడలో మళ్లీ కాల్పుల మోత.. మావోయిస్టు హతం!

- Advertisement -

గత కొన్ని రోజులుగా చత్తీస్ ఘడ్ లో పోలీసులు, మావోల మద్య కాల్పుల కలకలం చెలరేగుతుంది. ఈ మద్యనే బీజాపుర్‌ ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులైన తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

నీలవాయ అడవుల్లో జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, నక్సల్స్‌ వ్యతిరేక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో.. మావోయిస్టు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ చెప్పారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు.

చనిపోయిన మావోయిస్టు కు 15 కేసులతో ప్రమేయం ఉండటం సహా తలపై రూ.5లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలం నుంచి 9ఎంఎం పిస్టల్‌, దేశీవాళీ బార్మర్‌, 3 కిలోల పేలుడు పదార్థాలు, మందులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. హద్దు దాటితే కేసులే..

మాస్ మహరాజ దర్శకుడికి కరోనా పాజిటీవ్!

తెలంగాణలో కరోనా కలకలం.. 6 వేలకు చేరువలో కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -