- Advertisement -
తైవాన్లోని దిగ్గజ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్సీఐ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మధ్యాహ్న సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే 28 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నాయి.
తైపే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఎస్సీఐ ఫార్మా కంపెనీలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుకు అవసరమైన ముడిసరుకు తయారవుతోందని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ హెచ్సీక్యూ ముడిపదార్థాల సరఫరాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పంపిణీదారుగా ఉన్నట్లు వెల్లడించారు.