Saturday, April 27, 2024
- Advertisement -

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పట్టుబడిన ఉగ్రవాదులు.. లక్ష్యం గణతంత్ర దినోత్సవం..!

- Advertisement -

గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్​ పోలీసులు భగ్నం చేశారు. వారి స్థావరంపై దాడి చేసి ఇద్దరు ముష్కరులను అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్​ చేసిన ఇద్దరు తీవ్రవాదులను ఉమర్​ అహ్మద్​ మాలిక్, సుహేల్ అహ్మద్​ మాలిక్​గా గుర్తించారు పోలీసులు. వారు అనంత్​నాగ్​ బిజ్​బెహరా సెమ్​తాన్​ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు దుండగులు జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధరించారు. జైషే మహ్మద్​ సంస్థ ఉగ్రవాది అఖిబ్ అలియాస్ ఆల్ఫా.. వీరికి డ్రోన్స్​ ద్వారా ఆయుధాలను అందించినట్లు తెలిపారు. ఉగ్రకుట్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -