- Advertisement -
మధ్యప్రదేశ్లో వైద్యవిద్య సీట్ల కుంభకోణం కేసులో ఇద్దరిని ఇందోర్ ప్రత్యేక కార్య దళం(ఎస్టీఎఫ్) అరెస్టు చేసింది. కోరుకున్న కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ.. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల వద్ద నుంచి రూ.5 కోట్లను నిందితులు కాజేశారు. ముంబయికి చెందిన ఈ నిందితులు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని ఎంతోమంది విద్యార్థులను మోసం చేసినట్లు ఎస్టీఎఫ్ దర్యాప్తులో తేలింది.
నిందితుల వద్ద నుంచి ఓ ల్యాప్టాప్, ఇతర కీలక పత్రాలను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2000కు పైగా విద్యార్థుల వివరాలు వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులను నిందితులను మోసగించేవారని తెలిపారు.