తమిళనాడు లో ట్విస్ట్ రాజకీయం నడుస్తోంది. రోజు రోజుకూ హై టెన్షన్ నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరవాత అన్నా డీఎం కే లో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకి వస్తోంది. అమ్మ చనిపోయిన తరవాత పన్నీర్ సెల్వం ఆ కుర్చీ ఎక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పుడు శశికళ నానా కష్టాలు పడుతోంది అంటున్నారు. ఈ క్రమం లో తమిళ రాజకీయాలలో కొత్త ట్విస్ట్ వచ్చేసింది.
ఈ ట్విస్ట్ ని సొంత పార్టీ కాకుండా ఎక్స్ పార్టీ ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులను అన్నాడీఎంకే ఉన్న వర్గ పోరును సైలంట్ గా గమనిస్తూ ఉన్న డీఎంకే తాజాగా ఒకట్విస్ట్ ఇచ్చింది. అదేమిటంటే… ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్దపడాలని.. ఈ డిమాండ్ మేరకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని! దీంతో ఇప్పటికే శశికళ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ఒక వర్గం బలంగా వినిపిస్తుండగా ఈ సందర్భంలో పన్నీర్ సెల్వంకి డీఎంకే తాజా డిమాండ్ తో మరో పరీక్ష ఎదురైంది! ఈ సమయంలో పన్నీర్ సెల్వం బలనిరూపణపై దైర్యంగానే ఉన్నారా అనేది పెద్ద ప్రశ్నే!!