Thursday, May 9, 2024
- Advertisement -

సోనియా గాంధీ కి జ్వరం – మోడీ ఓవర్ యాక్షన్

- Advertisement -

జ్వరం రావడం మామూలే గానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లనాటి వాళ్లకి రావడం పెద్ద విశేషమే కావచ్చు. ఆ మాత్రానికి మీడియా హడావిడి చెయ్యడం మామూలే గానీ స్వయంగా ప్రధానమంత్రి కూడా హడావిడి చెయ్యడం విడ్డూరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు సోనియా, ఆమె చాలా నీరసంగా కనిపిస్తూ తన పర్యటనలు అన్నీ క్యాన్సిల్ చేసుకుని మరీ డిల్లీ తిరిగి వచ్చేసారు.

ఆమెకి జ్వరం వచ్చింది అని తెలియగానే మీడియా మామూలుగానే గొడవ గొడవ చేసారు. ఆ సంగతి తెలుసుకోగానే మోడీ ” ఆమె త్వరగా కోలుకోవాలి అని దేవుడిని ప్రార్దిస్తున్నాను ” అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసారు. కాంగ్రెస్ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగుతున్న షీలా దీక్షిత్ కి కూడా ఫోన్ చేసిన మోడీ ఆమె క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగలేదు.

వెంటనే డిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం, వైద్యుడిని వారణాసికి పంపించారు. వారణాసి విమానాశ్రయంలోనే సోనియా గాంధీకి అత్యవసర వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించారు. ఆ తరువాత ఆమె మోడీ పంపిన ప్రత్యేక విమానంలో డిల్లీ చేరుకొన్నారు.సోనియా కి జ్వరం రావడం ఏంటో మోడీ హడావిడి ఏంటో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -