కొంటె కోతులు దుఃఖాన్ని మిగిల్చాయి. అబం శుభం ఎరుగని చిన్నారి ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను ఎత్తుకుపోయాయి. అందులో ఒకరిని కందకం విసిరేశాయి. మరోకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లిపోయాయి. ఎంతో బాధను మిగిల్చిన ఈ ఘటన తమిళనాడులోని తంజాపూర్ జిల్లాలో జరిగింది.
ఆ కోతులు చేసిన పనికి… ఆ శిశువుల్లో ఒక పాప చనిపోయింది. మరోపాప ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి పోతే.. కోట్టై అగళి ప్రాంతానికి చెందిన రాజ, భువనేశ్వరి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. శనివారం ఇంట్లో చాపపై ఆ కవలలను పడుకోబెట్టి భువనేశ్వరి స్నానికి వెళ్లింది. కొద్దిసేపటికే కోతుల గుంపు వచ్చిన శబ్ధం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన భువనేశ్వరి ఇంట్లోకి వెళ్లి చూడగా శిశువులు పడుకోబెట్టిన చోట కనిపించలేదు.
వెంటనే బయటకు వెళ్లి వెతుకుతున్న సమయంలో ఇంటి పైకప్పు నుంచి ఒక శిశువు ఏడుపు వినిపించింది. ఇంటిపై కూర్చున్న కోతి చేతిలో పాప ఉండటాన్ని చూసి ఏడుస్తూ.. కేకలు వేసింది. దాంతో ఇరుగుపొరుగువారు కోతులను తరమడంతో శిశువును అక్కడే వదిలి కోతులు వెళ్లాయి. మరో శిశువు కోసం వెతికారు. ఇంటి వెనుక కందకం నీటిలో స్పృహ కోల్పోయి కనిపించింది. దాంతో శిశువును హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన పలువురిని కలచివేసింది.
బంగారం లాంటి కూతురు పుట్టింది. అదే రోజు పదవి వచ్చింది!