Friday, April 26, 2024
- Advertisement -

ఖతార్​ రాజు రాకతో మరిన్ని సందేహాలు..!

- Advertisement -

సౌదీ అరేబియాలో జరుగుతున్న గల్ఫ్​ అరబ్​ దేశాల నేతల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఖతార్​ రాజు షేక్​ తమీమ్​ బిన్​ హమ్మద్​ ఆల్​ తానీ హాజరయ్యారు. ఖతార్​పై కొనేళ్లుగా కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ ప్రకటించింది. దీంతో తమీమ్​​ ఈ సదస్సుకు హాజరయ్యారు. సౌదీ చేరుకున్న తమీమ్​కు ఘనస్వాగతం పలికారు ఆ దేశ యువరాజు మహ్మద్​ బిన్ సల్మాన్​.

ఇస్లామిక్​ గ్రూపులకు మద్దతివ్వడం, ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వల్ల ఖతార్​పై 2017లో ఆంక్షలు విధించాయి నాలుగు అరబ్​ దేశాలు. అప్పటి నుంచి అరబ్​ దేశాలతో ఖతార్​కు ద్వైపాక్షిక, సామాజిక సంబంధాలు తెగిపోయాయి.

అయితే అమెరికాలోని డొనాల్డ్​ ట్రంప్ సర్కార్​ సాయంతో కువైట్​ మధ్యవర్తిత్వంతో అరబ్​ దేశాలు- ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది.​ దీంతో సౌదీ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలో అల్-ఉలాలో జరుగుతున్న గల్ఫ్ అరబ్ నాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మూడేళ్ల తర్వాత తమీమ్​​ హాజరయ్యారు.

భారతీయ శాస్త్రవేత్త ప్రియా సురేష్​ల పై సీబీఐ కేసు నమోదు..!

సీన్ రివర్స్..ద్రవిడ మున్నేట్ర కళగం కీలక నిర్ణయం..!

ఆన్‌లైన్‌లో శిక్షణ మీకే కాదు.. మాకు కూడా అంటున్న ఉగ్రవాదులు..!

కొత్త గా వణికిస్తున్న బర్డ్​ ఫ్లూ కేసులు.. జర జాగ్రత్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -