Monday, May 6, 2024
- Advertisement -

సీన్ రివర్స్..ద్రవిడ మున్నేట్ర కళగం కీలక నిర్ణయం..!

- Advertisement -

తమిళనాట అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్న ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్​ నేతృత్వంలోని ఏఐఎంఐఎం​ పార్టీని తమ కూటమిలోకి ఆహ్వానించడంపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న పార్టీలతో తప్ప మరే ఇతర పక్షాలను కూటమిలో కలుపుకోవటం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

నూతన సంవత్సరం తొలిరోజున అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఎం​ఐఎం​ను.. డీఎంకే మైనారిటీ విభాగ అధ్యక్షుడు డాక్టర్​ మస్తాన్..​ కూటమిలోకి ఆహ్వానించారు. దీనిపై ఎం​ఐఎం​ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే.. ఈ విషయమై ముస్లిం పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఓవైసీని ఆహ్వానించడంపై డీఎంకే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

డీఎంకే మిత్రపక్షాలైన ఐయూఎంఎల్​​, ఇండియన్​ నేషనల్​ లీగ్​(ఐఎన్​ఎల్​) పార్టీలు.. ఓవైసీతో చేతులు కలపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎం​ఐఎం​ చేరికతో.. ఓట్లు చీలిపోతాయని భావించాయి. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్​తో సమావేశం కావాలని ప్రయత్నించినట్లు ఐఎన్​ఎల్​ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -